2023 సంక్రాంతి సమరానికి స్టార్స్ సిద్ధం అవుతున్నారు.ఇప్పటికే రేసులో ఉన్నవారు రిలీజ్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేయడంతో ఈ పోరుపై మరింత ఆసక్తి నెలకొంది.
దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగబోతోంది అని అనిపిస్తుంది.ఇక ఈసారి సంక్రాంతికి మన స్టార్ హీరోల్లో ఇద్దరు పోటీకి దిగుతున్నారు.
సీనియర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్నారు.దీంతో ఇరు హీరోల ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వీరు 6 ఏళ్ల తర్వాత పోటీ పడుతున్నారు.చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాతో సంక్రాంతికి రాగ అదే సమయంలో బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాతో దిగాడు.
కానీ అప్పుడు మెగాస్టార్ సినిమా విజయం సాధించింది.ఇక ఇన్నేళ్ల తర్వాత మరోసారి ఈ సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడబోతున్నారు.ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.
ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలను సంక్రాంతి బరిలో దింపుతున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది.
ఇక ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తుంది ఒకే నిర్మాణ సంస్థ.అదే మైత్రి మూవీ మేకర్స్.
![Telugu Balakrishna, Bobby, Chiranjeevi, Veerasimha-Movie Telugu Balakrishna, Bobby, Chiranjeevi, Veerasimha-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/11/Veera-Simha-Reddy-Vs-Waltair-Veerayya-Mytri-movie-makers-detailsa.jpg )
ఒకరోజు అటు ఇటు తేడాతో రాబోతున్న ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నే నిర్మిస్తుండడంతో రెండు చిత్రాలను ఎలా ప్రొమోషన్స్ చేస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పండుగ దగ్గర పడుతున్న ఇంకా షూటింగ్స్ మాత్రం పూర్తి చేసుకోలేదు.అలాగే ప్రొమోషన్స్ స్పీడ్ కూడా పెంచలేదు.కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ మాత్రం వచ్చాయి.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఇరు హీరోల ఫ్యాన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రొమోషన్స్ కూడా చేయాల్సి ఉంది.మరి ఏ మాత్రం తేడా వచ్చిన అభిమానులంతా నిర్మాతల మీదనే విమర్శలు చేసే అవకాశం ఉంది.
అందుకే మైత్రి మూవీ మేకర్స్ కు సంక్రాంతి వరకు ఉన్న సమయం చాలా కీలకం అనే చెప్పాలి.మరి ఇద్దరి హీరోలను మేనేజ్ చేస్తూ మైత్రి టీమ్ ఎలా ప్రొమోషన్స్ ప్లాన్ చేసి ఈ సినిమాలను రిలీజ్ చేస్తారో చూడాలి.