నేడు టీమిండియా- సౌతాఫ్రికా మధ్య కీలక వన్డే జరగనుంది.రాంచీ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
దీంతో నేడు జరగనున్న రెండో వన్డే మ్యాచ్ కీలకంగా మారిందని చెప్పొచ్చు.మూడు వన్డేల సిరీస్ పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలుపొందాలి.
అలా కాకుండా ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ వాళ్లదే అవుతుంది.దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.