రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఐదు రోజుల్లోనే ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.
రామరాజు, భీమ్ పాత్రలలో తారక్, చరణ్ తమ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.చరణ్ కు జోడీగా అలియా భట్ నటించగా తారక్ కు జోడీగా ఈ సినిమాలో ఒలీవియా మోరిస్ నటించారు.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో సీత పాత్ర కొరకు మేకర్స్ మొదట సాహో సినిమాలో నటించి మెప్పించిన శ్రద్ధా కపూర్ ను సంప్రదించారు.అయితే వేర్వేరు కారణాల వల్ల శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పలేదు.అప్పటికే వేరే సినిమాలకు డేట్స్ కేటాయించడం వల్ల శ్రద్ధా కపూర్ ఈ సినిమాను వదులుకున్నారని ప్రచారం జరిగింది.ఆ తర్వాత మేకర్స్ ఈ సినిమా కోసం పరిణీతి చోప్రాను సంప్రదించారు.
అయితే సీత పాత్రకు డేట్స్ కేటాయించే విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో పరిణీతి చోప్రా కూడా ఆ ఆఫర్ ను వదులుకున్నారని బోగట్టా.ఇక ఎన్టీఆర్ కు జోడీగా ఉన్న జెన్నీఫర్ రోల్ కోసం మేకర్స్ మొదట అమీ జాక్సన్ ను సంప్రదించారు.అయితే అమీ జాక్సన్ గర్భవతి కావడం వల్ల ఆ ఆఫర్ ను వదులుకున్నారు.ఆ తర్వాత ఈ పాత్ర కొరకు హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్నారు.
అయితే కొన్ని కారణాల వల్ల డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.ఆ తర్వాత ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ కు జోడీగా నటించడానికి ఎంపిక కావడం జరిగింది.చరణ్ అలియా జోడీ, ఎన్టీఆర్ ఒలీవియా మోరిస్ జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ అంచనాలను మించి విజయం సాధించింది.