కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ల కాంబినేషన్లో సినిమా వచ్చి దాదాపుగా 35 సంవత్సరాలు అయ్యింది.వీరిద్దరి మద్య స్నేహం ఉన్నా కూడా కలిసి నటించే అవకాశం రాలేదు.
ఇద్దరికి ఉన్న క్రేజ్ దృష్ట్యా వీరితో సినిమా చేసేందుకు దర్శకులు మరియు నిర్మాతలు ముందుకు వచ్చే సాహసం చేయలేక పోయారు.అయితే త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటించే అవకాశాలున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
‘లింగ’ సినిమా తర్వాత రజినీ నటించబోతున్న సినిమా దాదాపుగా ఖరారు అయ్యింది.
శంకర్ దర్శకత్వంలో రజినీ నటించేందుకు ఓకే చెప్పాడని, వీరిద్దరి కాంబినేషన్లో ‘శివాజీ’, ‘రోబో’ సినిమాల తర్వాత మరో సినిమా త్వరలో మొదలు కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే వీరిద్దరు కథ చర్చలు కూడా జరిపారని అంటున్నారు.
‘ఐ’ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో కమల్ హాసన్ కూడా నటించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.హీరోగా రజినీ నటిస్తుండగా, అందుకు సరి తగ్గ విలన్గా కమల్ హాసన్ అని శంకర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
త్వరలోనే కమల్తో చర్చలు జరిపే అవకాశాలున్నాయి.వీరిద్దర కాంబినేషన్లో శంకర్ దర్శకత్వంలో సినిమా వస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.