వాహనదారులకు పోలీస్ వారి విజ్ఞప్తి

నల్గొండ జిల్లా:మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలపై విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ఇచ్చిన డిస్కౌంట్ కు ఇక మూడు రోజుల గడువు మాత్రమే ఉంది.ఈ అవకాశం తేదీ:15-04-2022 సాయంత్రంతో ముగుస్తుంది.

మరియు ఇకపై ఈ అవకాశం పొడిగించబడదు.

కాబట్టి వాహానదారులందరూ మీ యొక్క వాహనాలపై ఉన్న చలాన్స్ క్లియర్ చేసుకోగలరు.అలాగే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు,బంధువులకు తెలియపరచగలరని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వము ఇచ్చిన డిస్కౌంట్లో భాగంగా టూ వీలర్/ త్రీ వీలర్ వెహికల్స్ పై ఉన్న చలానాలపై 75% డిస్కౌంట్,ఫోర్ వీలర్,హెవీవెహికల్స్ కి 50% డిస్కౌంట్,కరోనా సమయంలో మాస్కు పెట్టుకోని కారణంగా వేసిన కేసులలో 90% డిస్కౌంట్ ఇవ్వడం జరిగిందన్నారు.కావునా వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ యొక్క అవకాశాన్ని మీ యొక్క నెట్ బ్యాంకింగ్ లేదా పేటియం ద్వారా గానీ,మరియు మీ దగ్గరలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి గానీ,మీ వెహికల్ పై ఉన్న పెండింగ్ చలాన్స్ ను చెల్లించగలరని చెప్పారు.

Advertisement
కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్

Latest Nalgonda News