బుల్లితెర ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు లాస్ట్ ఎపిసోడ్ తాజాగా జెమినీ టివిలో నిన్న ప్రసారం అయ్యింది.ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు హాట్ సీట్ లో కూర్చుని గేమ్ ఆడాడు.
ఈ ఎపిసోడ్ అన్ని ఎపిసోడ్స్ కంటే బాగా అలరించిందనే చెప్పాలి.టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదిక మీద కనిపించడంతో ఈ ఎపిసోడ్ కు హైప్ బాగానే వచ్చింది.
అందులోను ఈ ఎపిసోడ్ ప్రోమోలను వదులుతూ జెమిని టీవీ యాజమాన్యం మరింత క్యూరియాసిటీ పెంచడంతో ఈ ఎపిసోడ్ కోసం తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూసారు.ఇక వారి ఎదురు చూపులకు ఫలితంగా నిన్న వీకెండ్ లో ఈ ఎపిసోడ్ ప్రసారం అవ్వడంతో అందరు ఈ ఎపిసోడ్ ను బాగా ఎంజాయ్ చేసారు.
ఈ ఎపిసోడ్ లో తారక్ మహేష్ బాబు నుండి చాలా విషయాలను రాబట్టాడు.
హాట్ సీట్ లో కూర్చుని మహేష్ 25 లక్షలు సంపాదించాడు.ఇక ఈ ఎపిసోడ్ లో తారక్ మహేష్ తో గేమ్ ఆడించడమే కాకుండా చాలా ఆసక్తికర విషయాలను మాట్లాడుతూ ఒకరికొకరు చాలా విషయాలను షేర్ చేసుకున్నారు.ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ మహేష్ ను చూసి నిన్ను చుస్తే నాకు ఈర్ష్యగా ఉంది అంటూ కామెంట్ చేసాడు.
షోలో భాగంగా మహేష్ తన కూతురు సితార గురించి మాట్లాడారు.సితార తో తనకున్న అనుబంధాన్ని మహేష్ ఈ సందర్భంగా తెలిపాడు.సితారతో నా సంబంధం రోజురోజుకూ మరింత బలపడుతుంది.తండ్రి కావడం చాలా గొప్ప అనుభూతి.సితార తో తండ్రిగా ప్రతి నిముషం ఎంజాయ్ చేస్తున్నాను.ఆనందిస్తున్నాను.
అని మహేష్ చెప్పగా.దీనికి తారక్ కూడా స్పందించారు.
కూతుళ్లు ఉన్న వాళ్ళను చూస్తే తనకు ఈర్ష్యగా అనిపిస్తుందని.మిమ్మల్ని చుసిన కూడా నాకు అలాగే ఉంది.
ఎందుకంటే నాకు ఇద్దరు అబ్బాయిలు కావడంతో కూతురు లేకపోవడంతో కాస్త వెలితిగా అనిపిస్తుందని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.