రాజన్న సిరిసిల్ల జిల్లా :సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గ పర్యటన వివరాలు ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండలం మొహినికుంటలో కల్వకుంట్ల చక్రధర్ రావు కుటుంబానికి పరామర్శ, ఉదయం 11.30 గంటలకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ.మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం.అలాగే మధ్యాహ్నం 1 గంటకు రాచర్ల గొల్లపల్లిలో ఎల్లమ్మ సిద్ధోగానికి హాజరై,రైతువేదిక ప్రారంభోత్సవం,మధ్యాహ్నం 2 గంటలకు రాచర్ల బొప్పాపూర్ లో గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం,మధ్యాహ్నం 2.30 గంటలకు రాగట్లపల్లిలో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం,సాయంత్రం 3 గంటలకు వెంకటాపూర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం, అనంతరం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్ లో ఇండ్ల పట్టాల పంపిణీ సిరిసిల్ల టౌన్ లో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Rajanna Sircilla News