తన భార్య దేశంలో ఉండటానికి భయపడుతోందని, దేశం విడిచి పోదామని అంటున్నాడని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేసిన కామెంట్ ప్రభావం ఇంకా తగ్గలేదు.అమీర్ను విమర్శిస్తూ రాజకీయ నాయకులు, ఇతరులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంలోని శివసేన మంత్రి అమీర్ ఖాన్తో పాటు షారూఖ్ ఖాన్, పాత తరం బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ను కూడా తిట్టారు.అమీర్, షారూఖ్ దేశంలో అసహనం పెరుగుతోందని కామెంట్ చేశారు కాబట్టి వారిని విమర్శించడంలో అర్ధం ఉంది.
కానీ మంత్రి రామదాస్ కదం పాత నటుడు దిలీప్ కుమార్ను కూడా ఇందులోకి లాగారు.అమీర్ పాకిస్తాన్ వెళ్ళవచ్చని మంత్రి సలహా ఇచ్చారు.
ఈ దేశం మీద ప్రేమ లేనివారు ఎక్కడికైనా పోవచ్చని అన్నారు.అమీర్ తో పాటు షారూఖ్ , దిలీప్ కుమార్ని కలిపి వీరు ముగ్గురు పాములవంటి వారని మంత్రి విమర్శించారు.
పాములకు పాలు పోసి పెంచినా అవి కాటేస్తాయి అనే అభిప్రాయం కావచ్చు.ముస్లీములు అయిన ఈ ముగ్గురూ హీరోలు అయినా దేశాన్ని ప్రేమించడం లేదని మంత్రి భావన కావొచ్చు.
కానీ దిలీప్ కుమార్ను విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఆయన్ని వివాదంలోకి ఎందుకు లాగారు?
.