నాగ శౌర్య హీరోగా నటించిన ఛలో సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్నా గీత గోవిందం సినిమా తో టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడం మరియు హిందీ భాషల్లో కూడా నటిస్తోంది.
హిందీ లో ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.తాజాగా ఈమె హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన ఈ సినిమా రష్మిక మందన్నా స్థాయి ని మరింతగా పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ సమయం లో రష్మిక పారితోషకం రెండున్నర కోట్ల నుంచి మూడున్నర కోట్ల వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
ఫుల్ బిజీగా ఉన్నా రష్మిక మందన ఒక స్టార్ హీరో సినిమా లో సెకండ్ హీరోయిన్ గా నటించబోతోంది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ పుకార్లపై నెటిజన్స్ ముఖ్యంగా ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ప్రస్తుతం రష్మిక రేంజ్ పాన్ ఇండియా స్టార్.అలాంటి రష్మిక సెకండ్ హీరోయిన్ గా నటించడం ఏంటి విడ్డూరం కాకపోతే అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఆ వార్తలు నూటికి నూరు శాతం అబద్దమే అంటూ వారు నమ్మకంగా చెబుతున్నారు.అసలు రష్మిక కు ఇప్పుడు వేరే హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు.
ఆ స్టార్ హీరో తో ముందు ముందు మెయిన్ లీడ్ గా సినిమాలు చేసే అవకాశం ఉంది కానీ ఇప్పుడు మాత్రం వేరే హీరోయిన్ మెయిన్ లీడ్ గా ఉండి రష్మిక సెకండ్ హీరోయిన్ గా మాత్రం సినిమా చేయదు.
అలా చేస్తుంది అనుకుంటే మాత్రం అది పొరపాటే అవుతుంది.ప్రముఖ దర్శకుడి దర్శకత్వం లో సినిమా అవడం వల్ల సెకండ్ హీరోయిన్ గా రష్మిక ఒప్పుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యం లో ఆ విషయాన్ని కూడా అభిమానులు కొట్టిపారేస్తున్నారు.ఎంత పెద్ద దర్శకుడు ఈ సమయం లో సెకండ్ హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించేందుకు అస్సలు ఒప్పుకోదు అంటూ ఆమె అభిమానులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.