గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీపై న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది.
ఓఎంఆర్ పై అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్, ఫోటో ఎందుకు లేదని హైకోర్టు ప్రశ్నించింది.పరీక్షల్లో అక్రమాలు నిరోధించడంలో కీలక అంశాలను విస్మరించారని తెలిపింది.దీనిపై బయోమెట్రిక్, ఫొటోకు రూ.1.50 కోట్లు ఖర్చు అవుతుందని టీఎస్పీఎస్సీ కోర్టుకు తెలిపింది.అయితే పరీక్ష నిర్వహణలో ఖర్చులు ముఖ్యం కాదన్న ధర్మాసనం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.