కాకినాడ జిల్లా జగ్గంపేటలో నల్ల పసుపు కొమ్ములు, మట్టికుండలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది.నల్ల పసుపు, మట్టి కుండలు మార్కెట్ లో కోట్లలో ధర పలుకుతున్నాయని శివ గణేష్ అనే వ్యక్తిని నమ్మబలికించారు.
గతంలోనూ ఈ విధంగానే మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జగ్గంపేట పోలీసులు.
తెలంగాణకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితుల నుంచి మట్టి కుండతో పాటు రూ.89 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.