మహారాష్ట్రలో మరో ఘోర అగ్ని ప్రమాదం.. ప్రమాదంలో కరోనా రోగుల ప్రాణాలు.. ?

ఇప్పటికే కరోనా కొరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న మహారాష్ట్రను ఇతర ప్రమాదాలు కూడా అల్లకల్లోలంగా మారుస్తున్నాయి.ఈ రాష్ట్రంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ప్రజల పాలిట యమ దూతలా మారుతున్నాయి.

 Fire Accident In Vijay Vallabh Hospital In Maharashtra , Maharastra, Fire, Vijay-TeluguStop.com

ఇక గత రెండు రోజుల క్రితం ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకై సుమారు పాతికమంది వరకు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటనను మరవకు ముందే, మరో ప్రమాదం విరుచుకు పడింది.ఆ వివరాలు చూస్తే.

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో ఉన్న విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారు జామున సుమారుగా 3.15 గంటలకు ఐసీయూలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 17 మంది కరోనా పేషెంట్లలో 12 మంది మరణించినట్లు సమాచారం.కాగా మిగిలిన ఐదుగురితో పాటు ఇతర రోగులను పక్కనున్న హాస్పిటల్ లోకి షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారట.ఇకపోతే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube