మాదకద్రవ్యాల వినియోగం ప్రాణాంతకరం:ఎస్ఐ జి.అజయ్ కుమార్

సూర్యాపేట జిల్లా:మాదకద్రవ్యాల వినియోగం ప్రాణాంతకమని, యువత వాటికి దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా నడిగూడెం ఎస్ఐ జి.అజయ్ కుమార్( SI G.

Ajay Kumar)అన్నారు.బుధవారంమండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 30 మంది యువతకు డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించారు.

Drug Use Is Deadly: SI G. Ajay Kumar , Suryapet District , Drug Use , ASI Jaga

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్,గంజాయి నిర్మూలన మన అందరి బాధ్యతని అన్నారు.యువత డ్రగ్స్ కు బానిసైతే మంచి భవిష్యత్తును కోల్పోతారని సూచించారు.

గంజాయి రవాణా,వినియోగం గురించి తెలిస్తే పోలీస్ వారికి సమచారం ఇవ్వాలని యువతను కోరారు.అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై ప్రచురించిన కర పత్రాలను యువతకు పంపిణీ చేశారు.

Advertisement

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జగన్నాథం,( ASI Jagannath )పోలీస్ సిబ్బంది వీరబాబు,యువకులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి2, ఆదివారం 2025
Advertisement

Latest Suryapet News