దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రతిరోజు దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తూనే ఉంటారు.పూజలే కాకుండా మరి కొంతమంది భక్తులు మంత్రాలు జపించడానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు.
మంత్రాలను జపించడం వల్ల దేవుని అనుగ్రహం వారిపై ఉంటుందని, అందువల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని చాలామంది ప్రజలు నమ్ముతారు.మంత్రం పాటించడం వల్ల జపించడం వల్ల శక్తి మనసు, మెదడుకు బదిలీ అవుతుంది.
వివిధ మంత్రాలు జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయని వేద పండితులు చెబుతున్నారు.పురాతన పురాణాల ప్రకారం మనదేశంలోని చాలామంది ప్రజలు మంత్రాలను జపిస్తూ ఉంటారు.
వాటిలో విష్ణు సహస్రనామం కూడా చాలామంది భక్తులు ఎక్కువగా జపిస్తూ ఉంటారు.
దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉండడమే కాక ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనసుకి ప్రశాంతత కూడా ఉంటుంది.
చెడు కలలు రాకుండా ఉంటాయి.చాలామంది ప్రజలు ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించాలని చెబుతూ ఉంటారు.
అయితే ఈ మంత్రం పఠించేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉంటాము.అది మన జీవితంపై ఎంతో ప్రభావం చూపే అవకాశం ఉంది.
విష్ణు సహస్రనామ పారాయణం చేసేటప్పుడు మనం అస్సలు చేయకూడని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విష్ణు సహస్రనామాన్ని జపించేటప్పుడు ఈ తప్పులను మాత్రం అస్సలు చేయకండి మలినమైన శరీరం మనసుతో ఈ నామాన్ని అస్సలు చూపించకూడదు.దీనివల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజ గదిలో కూర్చుని ఈ మంత్రాన్ని జపించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం ఆ ఇంటిపై ఉంటుంది.
మధ్యాహ్నం విష్ణు సహస్రనామ మంత్రాన్ని జపించకూడదు.ఎందుకంటే మధ్యాహ్నం భగవంతుని విశ్రాంతి సమయంగా చాలామంది భావిస్తారు.కాబట్టి ఈ సమయంలో పూజలు చేయడం అంత మంచిది కాదు.తెల్లవారుజామున ఈ మంత్రాన్ని జనం మంచిది.
అలాగే సాయంత్రం స్నానం చేసిన తర్వాత కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు.