అయోధ్య నగరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో ఈ మహోన్నత ఘట్టం జరగగా బాలరాముడు కొలువుదీరితే యావత్ భారతం పులకించిపోయింది.
మల్టీప్లెక్స్ ల ద్వారా, టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా దేశంలోని ప్రజలు ప్రాణప్రతిష్ట వేడుకను చూశారు.అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది.
కోట్ల సంఖ్యలో ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్య నగరంలో అపురూప రామమందిరం ఆవిష్కృతమైంది.రామ నామంతో అయోధ్య రామ మందిరం ( Ayodhya Ram Mandir )మారుమ్రోగింది.
అధ్యాత్మిక శోభతో అయోధ్య నగరమంతా కళకళలాడింది.దేశ విదేశాలకు చెందిన 7 వేల మంది ప్రముఖులు, స్వామీజీలు ఈ మహత్కార్యానికి హాజరయ్యారు.
ఈ నెల 23వ తేదీ నుంచి శ్రీరాముడు ( Lord Rama )భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
![Telugu Abhijit Lagna, Ayodhya, Lord Rama, Narendra Modi-General-Telugu Telugu Abhijit Lagna, Ayodhya, Lord Rama, Narendra Modi-General-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/01/ayodhya-lord-rama-photos-goes-viral-in-social-media-details-herec.jpg)
అధికారులు అయోధ్య నగరమంతా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ప్రాణప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా చూసిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు( Movie, political and sports celebrities ) పులకించిపోయారు.అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరగడంతో 500 సంవత్సరాల హిందువుల కల సాకారమైంది.
ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆలయంపై నుంచి హెలికాప్టర్లతో పూల్ వర్షం కురిపించారు.జై శ్రీరామ్ నినాదంతో కోట్ల సంఖ్యలో హిందువులు పులకరించిపోయారు.
![Telugu Abhijit Lagna, Ayodhya, Lord Rama, Narendra Modi-General-Telugu Telugu Abhijit Lagna, Ayodhya, Lord Rama, Narendra Modi-General-Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/01/ayodhya-lord-rama-photos-goes-viral-in-social-media-details-herea.jpg)
బాలరాముడు ధనస్సు ధరించి కమలంపై కొలువుదీరిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.బాలరాముడికి ప్రధాని నరేంద్ర మోదీ తొలి హారతి ఇచ్చారు.సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.అయోధ్యకు వేర్వేరు రంగాల సినీ ప్రముఖులు హాజరయ్యారు.ముఖేష్ అంబానీ దంపతులు కూడా అయోధ్యకు చేరుకున్నారు.అయోధ్యలో రామాయణ ఘట్టాలను వివరిస్తూ పలువురు గాయకులు గీతాలను ఆలపిస్తున్నారు.
పలువురు ప్రముఖ సినీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
LATEST NEWS - TELUGU