ముఖ్యంగా చెప్పాలంటే ఏ పని అయినా చేయడానికి కచ్చితంగా శుభ సమయం అనేది ఉంటుంది.మీరు ఏదైనా శుభకార్యాన్ని అ శుభ సమయంలో చేస్తే అది శుభం కాకుండా అశుభం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గరుడ పురాణంలో( Garuda Puranam ) జననం, మరణం, మరణం తర్వాత జీవితం, పుణ్యం, పాపం, పునర్జన్మ గురించి వెల్లడించారు.ప్రతి పనిని సరైన సమయంలో చేస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు అని పండితులు చెబుతున్నారు.
అశుభ సమయంలో చేసే శుభకార్యమైన లాభం కాకుండా కీడు కలుగుతుందని పురాణలలో ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే గరుడ పురాణం ప్రకారం ఏ సమయంలో ఏ పని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ ధర్మం ( Hindu Dharma )ప్రకారం తులసి మొక్కకు( Basil plant ) నీరు సమర్పించడం ఎంతో మంచిది.తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు సమర్పించాలి.
కానీ నీరు ఇవ్వడానికి నిర్ణీత సమయం ఉంటుంది.సాయంత్రం సమయంలో తులసి మొక్కకు నీళ్లు సమర్పించాలి.
అలాగే సాయంత్రం పూట తులసి చెట్టు కింద దీపం వెలిగించాలి.అంతే కాకుండా రాత్రి పూట తులసి చెట్టును పూజించడం కూడా అ శుభంగా పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే సూర్యాస్తమయం( sunset ) తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
ఇంకా చెప్పాలంటే మంగళ, గురు, శనివారాలలో జుట్టు, గడ్డం, గోళ్లు కత్తిరించకూడదని గరుడ పురాణంలో ఉంది.అలాగే ఆది, సోమ, బుధ, శుక్రవారం ఈ పనులు చేయడానికి అనుకూలమైనవి అని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే సూర్యాస్తమయం తర్వాత పెరుగు అసలు తినకూడదని చెబుతారు.ఒక వేళ సూర్యాస్తమయం తర్వాత పెరుగు తీసుకుంటే ఆయుర్దాయం తగ్గుతుంది.అలాగే సూర్యాస్తమయం తర్వాత ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు.సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీదేవి ( Goddess Lakshmi )ఉప్పు నైవేద్యానికి అసంతృప్తితో ఇంటి నుంచి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు.
కాబట్టి ఇలాంటి పనులు సరైన సమయానికి మాత్రమే చేయాలి.
DEVOTIONAL