నిన్ను కోరి, మజిలీ లాంటి ఫీల్ గుడ్ చిత్రాలతో అలరించిన దర్శకుడు శివ నిర్వాణ నుంచి వస్తున్న మూడో సినిమా టక్ జగదీష్.ఈ సినిమా ఎప్పుడో లాక్ డౌన్ కి ముందే స్టార్ట్ అయ్యింది.అయితే కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడింది.లాక్ డౌన్ సడలింపులు అనంతరం కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాలో నానికి జోడీగా తెలుగు హీరోయిన్స్ గా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ చేస్తున్నారు.జగపతిబాబు ఓ కీలక పాత్రలలో కనిపంచనున్నారు.
ఇదిలా ఉంటే టక్ జగదీష్ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయిందని వార్తలు వినిపించాయి.యూనిట్ లో ఓ టెక్నీషియన్ కరోనా బారినపడడంతో ముందు జాగ్రత్తగా చిత్రీకరణ ఆపివేశారని ప్రచారం జరిగింది.
కరోనా కారణంగా టీం మొత్తం హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయిందని టాక్ వినిపించింది.అయితే టక్ జగదీష్ సినిమాపై వచ్చిన రూమర్స్ ని దర్శకుడు శివ నిర్వాణ ఖండించాడు.
షూటింగ్ ఆగిపోలేదని, కొనసాగుతోందని ఓ వీడియో విడుదల చేశారు.టక్ జగదీష్ ను ఆపలేరు.38వ రోజున సెట్స్ పై ఇలా అంటూ శివ ట్వీట్ చేశారు.టక్ జగదీష్ సెట్స్ లో శానిటైజర్ యంత్రాలతో శుద్ధి చేస్తున్న వీడియోని శివ షేర్ చేశాడు.
ఇదిలా ఉంటే వి ఫ్లాప్ తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా ఇది కావడంతో దీని మీద గట్టి హోప్స్ పెట్టుకొని ఉన్నాడు.నాని కెరియర్ లో గత నాలుగు సినిమాలు ఏవరేజ్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
దీంతో టక్ జగదీష్ తో సాలిడ్ హిట్ కొట్టాలని నాని అనుకుంటున్నాడు.