కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరిక అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు.
షర్మిల రాజకీయంగా ఎక్కడనుంచైనా ప్రాతినిధ్యం వహించొచ్చని సజ్జల తెలిపారు.ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని తాము పట్టించుకోమని పేర్కొన్నారు.అదేవిధంగా షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.