ఖమ్మం జిల్లాలోని చైతన్య కళాశాలలో విద్యార్థులు ఘర్షణ నెలకొంది.ఓ విద్యార్థిపై అదే కాలేజీకి చెందిన మరికొంత మంది విద్యార్థులు కర్రలతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
కర్రల దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.దీంతో బాధిత విద్యార్థి తండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థులకు మధ్య వివాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.