ఇచ్చిన హామీల పై బహిరంగ చర్చకు సిద్దమా..అంతగిరి వినయ్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం ఏర్పటు చేయడం జరిగింది.గురువారం బిఆర్ యస్ నాయకులు పత్రిక విలేఖర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ పై చేసిన అనుచిత వాక్యాలపై మానకోండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు మేము సిధ్దం మీరు సిధ్దమైతే ఇల్లంతకుంట మండలకేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహ ముందు చర్చ పెట్టి మండల ప్రజలకు వివరిద్దం సమయం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చెప్పాలన్నారు.

 Are You Ready For An Open Discussion On The Promises Made? , Anthagiri Vinay Kum-TeluguStop.com

ఎంతసేపు కల్యాణలక్ష్మి చెక్కులు,సియం ఆర్ యఫ్ చెక్కలు ఇంటిఇంటికి వెళ్లి ఇచ్చిరావడం అభివృద్ధ అన్నారు.ఇకనైనా మండల ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరారు.

మేము మీరు ఇచ్చిన హామీలు మాత్రమే గుర్తు చేస్తున్నామని వెంటనే క్రీడాకారులకు మైదానం కేటాయించాలని డిమండ్ చేశారు.అసంపూర్తిగా ఉన్న కులసంఘ భవనాలను పూర్తి చేయాలని కోరారు.

ఇంకా ఎన్ని ప్రమాదాలు జరిగితే రోడ్లు వెడల్పు చేస్తారని అడిగారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడు చిట్టి ఆనంద రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలపోచయ్య, మైనర్టీ అధ్యక్షుడు జమాల్, యసి సి సేల్ అధ్యక్షుడు మచ్చ రాజేశం,యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏర్రోజు సంతోష్, జిల్ల కన్వీనర్ జుట్టు నగేష్,బిసి సి సేల్ నాయకులు తాట్ల వీరేశం, శ్రీనివాస్, నారయణ,జెట్టి మల్లేశం, స్వామి, తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube