నరేష్, పవిత్ర లోకేశ్( Naresh, pavitra Lokesh ) ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్.
రాజు డైరెక్షన్ లో మళ్లీ పెళ్లి ( malli pelli )పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు గత కొన్నిరోజులుగా ప్రచారం జరగగా తాజాగా ఆ సినిమా నుంచి టీజర్ విడుదలైంది.నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి( Ramya Raghupathi ) నిజ జీవితాలను ప్రతి బింబించేలా ఈ టీజర్ ఉండటం గమనార్హం.
నరేష్ రియల్ లైఫ్ లోని ఘటనలను ఈ టీజర్ లో ప్రధానంగా ప్రస్తావించారు.టీజర్ లో కొన్ని డైలాగ్స్ బోల్డ్ గా ఉండటం గమనార్హం.
ఈ టీజర్ కు విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.రమ్య రఘుపతి పరువు పోయేలా ఈ టీజర్ ఉండగా మాకేంటి కర్మ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ముసలోళ్లకు దసరా పండుగ అంటే ఇదేనెమో అంటూ మరి కొందరు అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.తెలుగు ఇండస్ట్రీ కన్నడపై చూపు తిప్పిందేంటి అనే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది.
రమ్య రఘుపతి పాత్రను వనితా విజయ్ కుమార్( Vanitha Vijay Kumar ) పోషించారు.ఇంటర్వ్యూలలో రమ్య చెప్పిన విషయాలను, హోటల్ లో ఆమె చెప్పుతో దాడి చేయడాన్ని టీజర్ లో చూపించారు.విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మన పరువు మనమే ఎలా తీసుకోవాలో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
ఈ సినిమా నరేష్ బయోపిక్కా అంటూ కొంతమంది అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు.ఈ టీజర్ గురించి రమ్య రఘుపతి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.నరేష్, పవిత్ర సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.