బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినిమా తరువాత తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నటిస్తున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రం ఆది పురుష్.
రామాయణం ఇతిహాసాల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ చూసిన అభిమానులు నేటిజెన్లు పెద్ద ఎత్తున టీజర్ పై విమర్శలు కురిపించారు.రామాయణం వంటి అద్భుతమైన మహాకావ్యం ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో రాముడుతో సహా ఇతరుల పాత్రలను కూడా ఎంతో అవమానకరంగా తీసారంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా టీజర్ పై విమర్శలు వెలువతాయి.
ఈ విధంగా ఈ టీజర్ పై విమర్శలు రావడంతో డైరెక్టర్ తిరిగి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారని అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విధంగా ఈ సినిమా గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నటువంటి నటి కృతి సనన్ ఆది పురుష్ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ…ఆది పురుష్ వంటి గొప్ప సినిమాలో నటించినందుకు తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని ఈమె తెలిపారు.అయితే ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.
అయితే టీజర్ చూసి సినిమాని అంచనా వేయకూడదు.ఆది పురుష్ అందరిని ఆశ్చర్యపరిచే విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటూ ఈ సందర్భంగా ఈమె ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కృతి సనన్ ఆది పురుష్ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.