మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన రెండవ చిత్రం ‘కంచె’.వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
భారీ అంచనాలున్న ఈ సినిమా ఆడియోను ఈనెల 17న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ మెగా వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ఇతర మెగా హీరోు హాజరు కాబోతున్నట్లుగా మెగా ఫ్యాన్స్కు సందేశం అందినట్లుగా తెలుస్తోంది.
చాలా కాలం తర్వాత మెగా హీరోలు అంతా కూడా ఒకే వేదికపై కలువబోతున్నారు.చిరు పుట్టిన రోజున పవన్ కళ్యాణ్ ఆయన్ను కలుసుకున్నా కూడా ఫ్యాన్స్ ముందు చిరు, పవన్లు కలిసి చాలా కాలం అయ్యింది.
దాంతో ఈ ఆడియో వేడుకకు భారీ క్రేజ్ ఉంది.మెగా ప్యాన్స్ భారీ స్థాయిలో ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘కంచె’ ట్రైలర్తో సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఆడియోకు మెగా హీరోలు అంతా హాజరు అయితే సినిమాపై మరింతగా అంచనాలు పెరిగే అవకాశాలున్నాయి.
ఈ సినిమాలో వరుణ్కు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించిన విషయం తెల్సిందే.రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.