దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) నిర్మాణం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే 500 సంవత్సరాల నాటి నుండి ఈ అయోధ్య మందిరం నిర్మించడం కోసం పోరాడుతున్నారు.
అయితే ఈ ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత నేడు రామ భక్తుల కోరిక నెరవేరుతుంది.
అయితే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం, జనవరి నెల 22వ తేదీన ప్రారంభోత్సవం కానుంది.
అయితే ఈ ఆలయాన్ని ఎంతో ప్రతిష్టంగా తయారు చేస్తున్నారు.ఇంకా చాలామంది ఈ ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇస్తున్నారు.అయితే ఈ ఆలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్లతో సహా మూడు అంతస్తులుగా( Three Floors ) నిర్మించారు.అయితే ఆ అంతస్తులలో ఏమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్( Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust ) ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ లో 160 మొదటి అంతస్తులో, రెండవ అంతస్తులో 132, మూడవ అంతస్తులో 34 స్తంభాలు ఉన్నాయి.అయితే మొత్తం ఆలయంలో 392 స్తంభాలు 44 తలుపులు ఉంటాయి.ఇక జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా( Ram Lalla ) విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.గ్రౌండ్ ఫ్లోర్ల పనులు కూడా పూర్తి చేసుకున్నాయి.
ఇక ఆలయ గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు.ఇక ఈ అంతస్తులో మొత్తం 14 తలుపులు అలాగే నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.

అలాగే సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి తూర్పు వైపు నుండి ఆలయ ప్రవేశం ఉంటుంది.ఇక ఆలయానికి వెళ్లడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఇస్తున్నారు.ఇక రెండవ, మూడవ అంతస్తులలో దర్భార్, ఇతర పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి.అలాగే ఇక్కడ వెండి రత్నాలతో అలంకరించబడిన సింహాసనం కూడా ఉంది.ఇక శిల్పులు ప్రత్యేకంగా తయారు చేసిన బాల రాముడు విగ్రహాలలో కూడా మిగిలిన రెండు విగ్రహాలను మొదటి ఇక రెండు అంతస్తులో ఏర్పాటు చేస్తున్నారు.అంతేకాకుండా శ్రీరాముని ఆలయ ప్రాంగణంలో ఇతర దేవాలయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.