రోజు ఉదయం ప్రసరించే సూర్య కిరణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను తీరుస్తాయి.ఉదయాన్నే సూర్య కిరణాలు మన శరీరం మీద పడితే చాలా ఉత్సాహంగాను,ఉల్లాసంగాను ఉంటుంది.
అంతేకాక ఉదయం పూట సూర్య కిరణాల్లో విటమిన్ D, A లు సమృద్ధిగా ఉండుట వలన చర్మ సమస్యలు రావు.అలాగే విటమిన్ D ఆహార పదార్ధాలలో కన్నా సూర్య కిరణాల్లో ఎక్కువగా లభిస్తుంది.
అలాగే ఆయుర్వేదంలో సూర్య కిరణాలను ఉపయోగించుకొని వైద్యం చేస్తారు.సూర్యోదయం సమయంలో చేసే నదీ స్నానాలకు కూడా ఒక ప్రత్యేకమైన విశేషమైన స్థానం ఉంది.
ఈ సమయంలో చేసే స్నానం మంచిదని మన పెద్దవారు చెప్పుతూ ఉంటారు.ఆ సమయంలో పడే కిరణాలు శరీరంలోని అనేక రుగ్మతలను నయం చేస్తుంది.
అందుకే ప్రకృతి చికిత్సలో తప్పనిసరిగా ఉదయం ఎండలో కొంతసేపు నిలబెడతారు.
సూర్య కిరణాలు శరీరంపై పడటం వలన చర్మ,నరాల,గుండెకు సంబందించిన వ్యాధులు తగ్గుతాయి.
అలాగే ఉదయం సమయంలో రాగి పాత్రలోని నీటితో తర్పణం వదలటం వలన రాగి పాత్రలోని నీటి గుండా కిరణాలు ప్రసరించి మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది.సూర్య నమస్కారం చేసే సమయంలో ఓంః గ్లీమ్ సూర్య ఆదిత్యాయః,ఓంః సూర్యయ నమః అనే శ్లోకాలను పఠించడం మంచిది.