దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆదాయం బాగా ఉండగా.మరికొన్ని రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయి.
వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు కొన్ని రాష్ట్రాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి.అలాగే ఉద్యోగుల జీతాలకు కూడా భారీగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి.
అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆదాయ వనరుల ద్వారా భారీగా డబ్బులు సంపాదించుకుంటూ రిచ్ స్టేట్స్గా పేరు తెచ్చుకుంటున్నాయి.దేశంలోనే రిచ్ రాష్ట్రాల లిస్ట్ తాజాగా బయటకు వచ్చింది.
రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా 2022-23 సంత్సరానికి గాను ధనిక రాష్ట్రాల జాబితాను సిద్దం చేశారు.ఇందులో దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది.దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై( Mumbai ) వల్ల అత్యంత ధనిక రాష్ట్రంగా మహారాష్ట్ర కొనసాగుతోంది.400 బిలియన్ల డాలర్ల జీఎస్డీపీతోమహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.ఇక జనాభా పరంగా కూడా మహారాష్ట్ర( Maharashtra ) దేశంలో మూడో స్థానంలో ఉండగా.అన్ని కార్పొరేట్ కంపెనీలు ఆ రాష్ట్రంలో ఉండటంతో రిచ్ స్టేట్స్ జాబితాలో తొలి స్థానాన్ని సంపాదించుకుంది.
ఇక రెండో స్థానంలో
తమిళనాడు
ఉండగా.ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది.
దేశ జనాభాలో 9.6 శాతం మంది తమిళనాడులో జీవిస్తున్నారు.పలు ప్రతిష్టాత్మక కంపెనీలు అక్కడ తమ ప్లాంట్లను నెలకొల్పాయి.దీంతో తమిళనాడు ఆర్థికంగా అభివృద్ది చెందుతోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ( Telangana ) టాప్ 10లో ఉండగా.ఏపీకి మాత్రం ఈ జాబితాలో స్థానం దక్కకపోవడంగమనార్హం.
ఏపీలో అభివృద్ధి లేకపోవడం, కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టపోవడంతో ఇంకా వెనుకబడి ఉంది ఇక కర్ణాటక నాలుగో స్థానం, ఉత్తరప్రదేశ్ ఐదో స్థానం, పశ్చిమబెంగాల్ ఆరో స్థానంలో, రాజస్థాన్ ఏడో స్థానంలో ఉంది.