సమాజంలో ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది.
బాధ్యత మోయలేని భర్తలు ఇంకా మాట పడలేని భార్యలు… ఎక్కువైపోయి.పంతాలకు వెళుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.
ఇక ఇదే సమయంలో మరి కొంతమంది అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు.దీనిలో భాగంగా పెళ్లి కాకముందు తిరిగిన వారితో మళ్ళీ టచ్ లోకీ వెళ్లి అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు.
ఈ రకంగానే విజయనగరంలో పెళ్లయిన ప్రియురాలీతో… రిలేషన్ ఇంకా కొనసాగించి అడ్డంగా బుక్ అయి అనంత లోకాలకు వెళ్లిపోయాడు ఓ ప్రియుడు.
పూర్తి వివరాల్లోకి వెళితే విజయనగరానికి చెందిన ఆర్ఎస్ నాయుడు (25) తాను ఇంటర్ చదివే టైంలో ఓ అమ్మాయిని ప్రేమించడం జరిగింది.
కానీ ఆ అమ్మాయికి ఓ అద్యాపకుడితో పెళ్లయింది.ఈ పెళ్లి జరిగి ఆరు సంవత్సరాలు అయింది.అయితే ఇటీవల ఆమె తన పుట్టింటికి రావడం జరిగింది.దీంతో ఆర్ఎస్ నాయుడు ఆమెతో మాట్లాడటానికి… ఆమె ఇంటి వద్దకు రహస్యంగా వెళ్లడం జరిగింది.
ఆ సమయంలో ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఆమె భర్త… రావటంతో బాల్కనీ నుంచి ఆర్ఎస్ నాయుడు కిందకి దూకేశాడు.ఈ క్రమంలో కింద పడటంతో తీవ్ర గాయాలు పాలై హాస్పిటల్ లో జాయిన్ అయ్యి.
తుది శ్వాస విడిచాడు.