ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి.స్పీకర్ తమ్మినేని ప్రశ్నోత్తరాలను చేపట్టగా.
ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ పై చర్చ జరుగుతోంది.
కడప స్టీల్ ప్లాంట్ కు టీడీపీ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేశారని, కేంద్రంతో సమన్వయం చేసుకుని పనులను చేపట్టామని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు తెలిపారు.అనంతరం ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారిందన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ దానికి మళ్లీ శంకుస్థాపన చేశారని.కానీ మూడేళ్లు గడిచిపోయిన నిర్మాణాన్ని మాత్రం చేపట్టలేదని విమర్శించారు.
ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని కల్పించుకుని విషయాన్ని పక్కదోవ పట్టించొద్దని అచ్చెన్నాయుడుకు సూచించారు.కడప స్టీల్ ప్లాంట్ పైనే మాట్లాడాలని, వేరే విషయం గురించి మాట్లాడొద్దని చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి కడప ప్లాంటును పూర్తి చేయాలని టీడీపీ తరపున అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.