కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ వేవ్ వరుసబెట్టి జనాలను నానా ఇబ్బందులకు గురి చేసిన విషయం విధితమే.దేశమంతటా కరోనా నిబంధనలతోపాటు మాస్క్ తప్పనిసరి పెట్టుకోవడం జరిగింది.
అయితే ఇలాంటి క్రమంలో మాస్క్ ఎలా పెట్టుకోవాలో చిన్నపిల్లలకు కూడా తెలుసు.ఆ రేంజ్లో అందరూ మాస్క్ల వాడకానికి అలవాటుపడిపోయాం.
ప్రస్తుతం కరోనా మూడో దశ కూడా ముగుస్తోంది.ఈ క్రమంలో మాస్క్ పెట్టుకోవడం రాకుంటే….
ఎలా ధరించాలో తెలియకుంటే ? మాస్క్ ధరించడం తెలియకుంటే అదీ పదిమందిలో అయితే చూసే వాళ్లకు ఇక నవ్వులే కదా.ఇలాంటి సంఘటన కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీనికి ఓ రేంజ్లో కామెంట్లు కూడా వస్తున్నాయి.
అయితే మాస్క్ ధరించడం తప్పనిసరి కాగా చాలామంది పెట్టుకోడానికి విముఖత చూపుతున్నారు.
ముక్కుకు, గాలికి మధ్య అవరోధం, అసౌకర్యం కలుగుతుందని కావచ్చు.నిర్లక్ష్యం వహిస్తారు.
దీంతో దేశంలో కోవిడ్ ఎలా విజృంభించినా మాస్కు ధరించట్లేదు.ఇలా ఫీల్ అయినా… అందరూ మాస్క్ ధరించడం జరిగింది.
కరోనా వచ్చి రెండేండ్లు దాటినా మాస్క్ ధరించడం రాని వారు కూడా ఉన్నారు.అదీ ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తకు ఈ సమస్య ఎదురైంది.
దీనికి సంబంధించిన వీడియా వైరల్ అవుతోంది.ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోరఖ్పూర్లో శివసేన నేతలు ర్యాలీ నిర్వహించారు.
అక్కడే ఓ సభలో శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే మాట్లాడుతుంటే పక్కనే నిల్చున్న ఓ కార్యకర్తకు మాస్క్ పెట్టుకోవడం తెలియలేదు.నానా రకాలుగా మాస్క్ను అటు తిప్పినా, ఇటు తిప్పినా మాస్క్ పెట్టుకోవడం రాలేదు.ఈ ఎన్ -95 మాస్కేంటో అది ఎలా వాడాలో తెలియలేదు.చివరకు మరో వ్యక్తి వివరంగా చెప్పడంతో మాస్క్ ఎలా పెట్టుకోవాలో అర్థం చేసుకున్నాడు.ఈ వీడియోకి మరో స్ఫూఫ్ వీడియో ఆడ్ చేసి మరీ ఆటాడేసుకుంటున్నారు.ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడం… మాస్కు పెట్టుకోగానే సంబురాలు చేసుకున్న ఫొటో జతచేస్తూ ఫైల్ ఫుటేజీలు పెట్టారు.
దీంతో ఈవీడియో తెగ వైరల్ అయింది.