బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా అందరికీ ఎంతో సుపరిచితమైన యాంకర్ అనసూయ వెండితెరపై రంగమ్మత్త పాత్ర ద్వారా అందరినీ మరోసారి ఆకట్టుకుంది.ఈ విధంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
ఈ క్రమంలోనే అనసూయ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప చిత్రంలోని పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.మొదటి పార్ట్ లో అనసూయ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ పార్ట్ 2 లో ఈమె పాత్ర ఎంతో హైలెట్ గా ఉంటుందనే వార్తలు వినబడుతున్నాయి.
ఇదిలా ఉండగా పుష్ప సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన అనసూయ తాజాగా దర్జా అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.కామినేని శ్రీనివాస్ సమర్పణలో కెఎల్ నారాయణ నిర్మాతగా… పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సలీం మాలిక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.ఈ సినిమాలో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయి పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పోస్టర్ లో భాగంగా అనసూయ కారు పై కూర్చుని కత్తి చేతిలో పట్టుకొని ఎంతో రాక్షసంగా కనిపిస్తారు.ఇక ఈ సినిమాలో అనసూయతో పాటు ప్రముఖ కమెడియన్ సునీల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ రెండు పాత్రలు సినిమాకు ఎంతో హైలెట్ గా ఉంటాయని చిత్రబృందం వెల్లడించారు.
ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుందని చిత్ర బృందం వెల్లడించారు.ఈ సందర్భంగా అనసూయ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ఈ సినిమాకు నిర్మాత ఎంతో నిజాయితీగా పని చేశారని ఈ సినిమా చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ అతనికి సపోర్ట్ చేశామని తెలిపారు.అయితే దర్జా చిత్రబృంద సభ్యులు గురించి ఇప్పుడేం మాట్లాడనని సమయం వచ్చినప్పుడు అందరి గురించి తెలియజేస్తానని అనసూయ ఎంతో “దర్జాగా” ఈ సినిమా గురించి మాట్లాడారు.ఈ విధంగా ఈ సినిమా గురించి అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోస్టర్ ను అనసూయ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ చాలా క్రూరమైనది అంటూ కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.