టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.బాలయ్య ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేశారు.సీఎం జగన్ తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం గురించి టీడీపీ ముఖ్యనేతలు ఎవరూ స్పందించలేదు.
చంద్రబాబు సైలెంట్ గా ఉన్నా చంద్రబాబు బావమరిది అయిన బాలయ్య మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు.కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయడం కరెక్ట్ కాదని బాలయ్య చెప్పుకొచ్చారు.
అదే సమయంలో హిందూపురం ప్రజల మనోభావాలను సీఎం జగన్ గౌరవించాలని పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా కాకుండా హిందూపురంను జిల్లా కేంద్రంగా చేసి ఉంటే బాగుండేదని బాలయ్య కామెంట్లు చేశారు.
హిందూపురంను శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తాను కోరుకుంటున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు.బాలయ్య సూచించిన మార్పులపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.మరోవైపు సీనియర్ ఎన్టీఆర్ పేరిట సీఎం జగన్ జిల్లాను ఏర్పాటు చేయగా ఈ నిర్ణయానికి సంబంధించి బాలయ్య స్పందించలేదు.
అయితే జగన్ కొత్త జిల్లాల నిర్ణయంకు బాలయ్య మద్దతు ప్రకటించడంతో ఎన్టీఆర్ జిల్లా పేరును ప్రకటించడం కూడా బాలయ్యకు నచ్చిందని బాలయ్య, వైసీపీ అభిమానులు భావిస్తున్నారు .
మరోవైపు బాలయ్య ఫిబ్రవరి నెల నుంచి షూటింగ్ పనులతో బిజీ కానున్నారు.రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీన్లతో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం.గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారనే సంగతి తెలిసిందే.బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు.