విజయశాంతి. తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించారు.
దక్షిణ భారతదేశంలో “ద లేడీ సూపర్ స్టార్”, “లేడీ అమితాబ్” గా ఆమె పేరు సాధించి, ఇప్పటికీ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు విజయశాంతి.
దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి విజయశాంతి.
ఇటీవలీ కాలంలో మహేశ్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.దీంతో ఆమె మరోసారి తన నటనతో తెలుగు అభిమానుల మదిని దోచుకున్నారు.
ఇకపోతే విజయశాంతికి మహేశ్ బాబుతో నటించడం ఇప్పుడేం మొదటిసారి కాదు.ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురం సినిమాలోనూ మహేశ్కు తల్లిగా నటించి అప్పట్లోనే మంచి మార్కులు సాధించారు విజయశాంతి.
ఇదిలా ఉండగా ఆ సినిమాలో ఓ సీన్లో భాగంగా విజయశాంతి, మహేశ్ బాబును చెంప మీద కొట్టాలని డైరెక్టర్ చెప్పారట.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా? కృష్ణ గారే.ముందుగా ఆ సీన్ను చేయడానికి ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారట.
అయినప్పటికీ విజయశాంతి మహేష్ బాబును కొట్టడానికి చాలా ఫీల్ అవ్వడంతో ఇలా అయితే ఎలా అండీ.అని అన్న కృష్ణ.ఇక విసుగెత్తిపోయి ఆ సీన్ అలా చేస్తేనే పండుతుందని అన్నారట.
వీళ్ల ధోరణి చూస్తున్న మహేశ్ బాబు, కొట్టండి మేడం పర్వాలేదు అన్నారట.ఇక ఇంకో మార్గం లేకపోవడంతో విజయశాంతి మహేష్ బాబును కొట్టినట్టు చేసి ఆ సీన్ను అలా ముగించేశారట.
ఆ విధంగా మహేశ్ బాబుతో ఆమె ప్రయాణం సాగిందని చెప్పవచ్చు.