పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా అజ్ఞాతవాసి సినిమా వచ్చింది.ఆ సినిమా తర్వాత దాదాపు రెండు ఏళ్ల గ్యాప్ తీసుకుని తన 26వ సినిమాను మొదలు పెట్టాడు.
సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది.మూడు సంవత్సరాల తర్వాత పవన్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇక పవన్ 27వ సినిమా ఏంటీ అనే విషయమై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.క్రిష్ దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.
కాని కరోనా ప్లానింగ్ అంతా మార్చేసిందని పవన్ 27వ సినిమాగా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియుమ్ను రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా దర్శకుడు క్రిష్ బర్త్ డే సందర్బంగా అది ఏమాత్రం నిజం కాదు అంటూ తేలిపోయింది.
అయ్యప్పన్ రీమేక్ కంటే ముందే పవన్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.,/br>
పవన్ 27 టీమ్ తరపున క్రిష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటూ ప్రొడక్షన్ టీం ఒక పోస్టర్ ను విడుదల చేసింది.
దాంతో పవన్ 27వ సినిమానే ఆ సినిమా రాబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.పవన్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ వచ్చే నెలతో పూర్తి అయ్యే అవకాశం ఉంది.
ఇదే సమయంలో ఆయన క్రిష్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.మూడు నెలల పాటు రూపొందబోతున్న క్రిష్ మూవీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మూవీ ఉంటుంది.
ఆ తర్వాత మలయాళ అయ్యప్పన్ మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ ఎలా అయితే ఇప్పటి వరకు ఆర్డర్ లో సినిమాలు ప్రకటన చేశాడో అదే ఆడర్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు అంటున్నారు.
అంటే 27వ సినిమాను క్రిష్ దర్శకత్వంలో 28వ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ఆయన చేస్తాడని అంటున్నారు.ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తాడు.
ఇక మలయాళ రీమేక్ ఎప్పుడు చేస్తాడు అనేది వచ్చే ఏడాదిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.