డార్లింగ్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది.
ఇందులోపూజా హెగ్డే ప్రభాస్ కి జోడీగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.పీరియాడికల్ రొమాంటిక్ లవ్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే ని రివీల్ చేశారు.అలాగే డార్లింగ్ ప్రభాస్ పాత్రని కూడా పరిచయం చేశారు.
పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు.
అయితే కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆరు నెలలు షూటింగ్ లేకుండా ఆగిపోయింది.
అయితే లాక్ డౌన్ అనంతరం మరల టీం ఇటలీ వెళ్ళిపోయి షూటింగ్ చేసుకుంటున్నారు.
మేగ్జిమమ్ సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు.ఇక పెండింగ్ అంతా హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఇప్పటి నుంచే నిర్మాతలు రెడీ అవుతున్నారు.డేట్స్ లాక్ చేసే పనిలో ఉన్నారు.
రాధేశ్యామ్ డేట్ లాక్ చేస్తే ఆ సమయంలో మిగిలిన వాళ్ళు రిలీజ్ వాయిదా వేసుకునే అవకాశం ఉంటుందని దానికి ప్లాన్ చేస్తున్నారు.దీంతో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్రస్తుతం రెండు తేదీలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది జనవరి 1న కానీ, సంక్రాంతి సందర్భంగా జనవరి 14న కానీ విడుదల చేయాలని భావిస్తున్నారట.ఈ రెండింటిలోనూ ఒక తేదీని త్వరలోనే ఫైనల్ చేస్తారని అంటున్నారు.