స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పటికే తొలి షెడ్యూల్లో కొంతమేర షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.
సుకుమార్-బన్నీ కాంబోలో ఈ సినిమా ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.అయితే ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్లో కనిపిస్తాడు.కాగా కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్డౌన్తో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇప్పుడు సినిమా షూటింగ్లు ప్రారంభం అవుతుండటంతో పుష్ప సినిమాను కూడా తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.అయితే కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్ను హైదరాబాద్ పరిసరాల్లోనే పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇందులో భాగంగా అడవి బ్యాక్డ్రాప్కు చెందని కీలక సన్నివేశాలను నల్గొండ జిల్లాలోని అడవుల్లో పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఇందులో భాగంగా సుకుమార్ అండ్ టీమ్ ప్రణాళిక రెడీ చేస్తోంది.
ఇక ఈ సినిమాలో బన్నీ లుక్ చాలా మాస్గా ఉండనుండగా, ఇందులో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.