టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సుకుమార్ తనదైన టేకింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు.కాగా ఈ డైరెక్టర్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఈ సినిమా నిలవడంతో ఆయన తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
తన నెక్ట్స్ మూవీ కోసం దాదాపు అందరూ హీరోలను కలిశాడు ఈ డైరెక్టర్.
అయితే పూర్తి మాస్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సుకుమార్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎవరూ ఒప్పుకోలేదు.కాగా తనకు ఎంతో కలిసొచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి పుష్ప అనే టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించిన సుకుమార్, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.అయితే లాక్డౌన్ నుండి సడలింపు లభించడంతో సినిమా షూటింగ్లు మొదలవుతుండటంతో పుష్ప సినిమా షూటింగ్ను కూడా మొదలుపెట్టాలని సుకుమార్ ప్లాన్ చేశాడు.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో చిత్ర వర్గాలు షూటింగ్లు మరోసారి రద్దు చేస్తున్నారు.దీంతో తాను ఇంకా షూటింగ్ మొదలుపెట్టకముందే మళ్లీ ఇలా వాయిదా పడుతుండటంతో సుకుమార్ ఫ్రస్ట్రేషన్ చాలా పీక్స్కు చేరుకుందట.
ఇప్పటికే రెండేళ్ల గ్యాప్ రావడంతో బన్నీతో వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్న సుకుమార్కు కరోనా వైరస్ పెద్ద అడ్డంకిగా మారిందట.మరి ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.