సెలబ్రెటీలు పలువురు పల్లెవాతావరణంను కోరుకుంటూ ఉంటారు.పల్లెటూరు వారు ఎక్కువగా పట్టణంపై మోజు పడుతూ ఉంటారు అది వేరే విషయం అనుకోండి.
సెలబ్రెటీలు పల్లెటూర్లలో పొలాలు కొంటూ అక్కడ ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.ఇదే విషయాన్ని తాజాగా రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.
తాజాగా సోషల్ మీడియాలో తనకు పల్లెటూరు అంటే ఎంత అభిమానమో చెప్పకనే చెప్పింది.
కొన్ని వారాల క్రితం వికారబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో షూటింగ్ నిమిత్తం వెళ్లిన రేణు దేశాయ్ అక్కడి పిల్లలతో సరదాగా గడిపింది.ఆ వీడియోను పోస్ట్ చేసి చాలా ప్రశాంతమైన వాతావరణం పల్లెటూరులో ఉంటుంది.అందుకే నా పిల్లలు పెద్ద వారు అయ్యి కాలేజ్కు వెళ్లిన సమయంలో నేను ఒక పల్లెటూరులో పొలం చూసుకుని కూరగాయలు పండిస్తూ ఉంటానంటూ చెప్పుకొచ్చింది.
పల్లెటూరు అంటే తనకు అత్యంత అభిమానం అంటూ చెప్పుకొచ్చింది.
వ్యవసాయం చేయడంతో పాటు జంతువులను పెంచుతూ ఉండాలనేది కూడా తన కోరిక అంది.
అందుకోసం తనవంతు కృషి చేస్తానంది.ఇప్పటి నుండే పొలం ఫామ్ హౌస్ను ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.
పిల్లలు ప్రస్తుతం పుణెలో చదువుకుంటున్నారు.వారితో రేణు దేశాయ్ కూడా అక్కడే ఉంటున్న విషయం తెల్సిందే.