సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ల కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ రూపొందిన ‘2.ఓ’ దాదాపు నాలుగు సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
రికార్డు స్థాయిలో ఈ చిత్రం 550 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయిస్తూనే, మరో వైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు శంకర్ పాల్గొంటున్నాడు.
తాజాగా శంకర్ ఒక ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడుతూ 2.ఓ చిత్రంలో కమల్ చేయాల్సిందని, కాని ఆయన ఇతరత్ర కమిట్మెంట్స్ కారణంగా నో చెప్పాడని పేర్కొన్నాడు.
రజినీకాంత్ హీరోగా ఈ చిత్రంలో నటించగా, విలన్కు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది.అందుకే హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ను ఎంపిక చేయాలనుకున్నాను.కాని అది వర్కౌట్ కాలేదు.
ఆ తర్వాత ఎంతో మందితో సంప్రదింపులు జరిపాను.కాని ఏ ఒక్కరు ఆసక్తి చూపించలేదు.
ఆ సమయంలోనే కమల్ హాసన్తో విలన్ పాత్ర పోషింపజేయాలని ఆశ పడ్డాను.కాని కమల్ ఆ సమయంలో నో చెప్పాడు.
దాంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో అనుకోకుండా ఈ కథ చెప్పడం, ఆయనకు బాగా నచ్చి వెంటనే నటిస్తాను అంటూ ముందుకు రావడం జరిగి పోయిందని చెప్పుకొచ్చాడు.
‘2.ఓ’ చిత్రంలో నటించేందుకు ఇష్టం లేక కమల్ బిజీ షెడ్యూల్ అని చెప్పి ఉంటాడు.ఎందుకంటే రజినీకాంత్ వంటి స్టార్ హీరో చిత్రంలో నటిస్తే కమల్ ఫ్యాన్స్ ఊరుకోరేమో.ముఖ్యంగా విలన్ పాత్రలో నటిస్తే ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరనే ఉద్దేశ్యంతో కమల్ అందుకు నో చెప్పి ఉంటాడని తెలుస్తోంది.
ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్ మూవీగా 2.ఓ మారిపోయింది.ఇలాంటి సమయంలో కమల్ అయ్యో విలన్గా అయినా నటించనైతినే అనుకుంటూ ఉంటాడు.
2.
ఓ చిత్రంలో ఛాన్స్ మిస్ చేసుకున్నా కూడా శంకర్ దర్శకత్వంలో త్వరలో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని చేసేందుకు కమల్ సిద్దం అవుతున్నాడు.శంకర్, కమల్ల కలయికలో వచ్చిన 2.ఓ చిత్రం ఒక అద్బుతం.ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది.2019లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.