శివయ్యకు( Lord shiva ) ప్రత్యెక్కించిన ఈ దేవాలయం పేరు మురుడేశ్వర్.మురుడేశ్వర్ అనేది శివయ్య పేరు.
ఈ దేవాలయంలో ఆ మహా పరమేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ విగ్రహం ఎత్తు సుమారు 123 అడుగులు ఉంటుంది.
ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం అని పండితులు చెబుతున్నారు.ఈ శివుని విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.
ఈ మహాదేవుని విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు దాదాపు 5 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.
ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే పురాణాల ప్రకారం రావణుడి తపస్సుకు సంతోషించిన శివుడు అతనికి లింగాన్ని ఇచ్చాడు.నువ్వు అమరుడవ్వాలంటే దానికి దారిలో శివలింగాన్ని( Shivalingam ) పొరపాటున కూడా నేల మీద పెట్టరాదని శివుడు రావణుడితో చెప్పాడు.
కానీ గణేశుడు చాతుర్యంతో రావణుడిని లంకకు పంపి లింగాన్ని గోకర్ణం పై ఉంచేలా చేశాడు.
దానికి కోపోద్రికుడైన రావణుడు ఈ లింగాన్ని మూలాల నుంచి నాశనం చేయడానికి ప్రయత్నించాడు.ఇంతలో శివలింగాన్ని కప్పిన వస్త్రం మృడేశ్వరుని కందుక పర్వతం మీద పడింది.ప్రస్తుతం మృడేశ్వర్ను మురుడేశ్వర్( Murdeshwar ) అనీ పిలుస్తారు.
ఈ మురుడేశ్వర్ దేవాలయం బెంగళూరుకి 497 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ దేవాలయం భక్తి జ్ఞాన కేంద్రంగా వెలిసింది.
ఈ దేవాలయంలోనీ 123 అడుగులు ఎత్తైన మహా శివుడిని దర్శించుకోవడం ఆధ్యాత్మికం అని భక్తులు చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ఈ దేవాలయానికి మూడు వైపులా సముద్రం ఉంటుంది.
అంతే కాకుండా ఇక్కడ సూర్యాస్తమయం, బీచ్, కొల్లూరు టెంపుల్ తప్పక చూడదగిన ప్రదేశాలు అని స్థానికులు చెబుతున్నారు.