హిందూ సనాతన ధర్మంలో దేవతలకు నైవేద్యం సమర్పించి ప్రసాదం( Prasadam ) రూపంలో స్వీకరించే సంప్రదాయం పూర్వం ఎన్నో రోజులుగా కొనసాగుతూ ఉంది.భగవంతుని ప్రసాదం స్వీకరించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియదు.
అందుకే చాలామంది దానిని ఆహారంగా భావిస్తూ ఉంటారు.మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా దైవ సంబంధిత కార్యక్రమం జరిగినప్పుడు భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు.
ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు చాలామందికి తెలియదు.భగవంతుని ప్రసాదం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
భగవంతుని ప్రసాదం స్వీకరించడం వల్ల మనస్సు స్వచ్ఛంగా, ప్రశాంతంగా మారుతుంది.సాధారణంగా ఇతర ఆహారాల కంటే ప్రసాదం తక్కువగా తింటారు.
కానీ అది మనకు రెట్టింపు సంతృప్తిని కలిగిస్తుంది.ప్రసాదం తీసుకోవడం వల్ల మనసులోను, మెదడులోను సానుకూల భావద్వేగాలు ఏర్పడతాయి.
భగవంతుడికి సమర్పించే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల భగవంతునితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది.
![Telugu Arjuna, Devotional, Krishna, Lord, Prasadam, Puja, Temple-Latest News - T Telugu Arjuna, Devotional, Krishna, Lord, Prasadam, Puja, Temple-Latest News - T](https://telugustop.com/wp-content/uploads/2023/08/lord-Krishna-Arjuna-Panchamrutha-prasadam-nutrients-devotional-puja.jpg)
ప్రసాదం మన మనసులో భగవంతుని పట్ల భక్తిని మరియు విశ్వాసాన్ని కలిగిస్తుంది.ప్రసాదం లో అన్ని రకాల పోషకాలను కలిగి ఉండడం వల్ల మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.పంచామృత ప్రసాదం( Panchamrutha prasadam ) చరణామృత ప్రసాదం, బెల్లం మినుము కొబ్బరి తులసి ఇతర వంటకాలతో కలిపి తింటే రోగాలు నయం అవుతాయి.
మనం నిత్యం భగవంతుని ప్రసాదాన్ని ఇతరులకు అందజేయడం వల్ల మీ పట్ల ప్రజలు కూడా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు.దేవుని పట్ల ప్రేమ కూడా మీ హృదయంలో ఉంటుంది.
భగవంతునితో నిరంతరం అనుసంధానం కావడం ద్వారా మనసు స్థితి, దిశ మారుతుంది.దీని ద్వారా మీరు దైవత్వాన్ని అనుభవిస్తారు.
![Telugu Arjuna, Devotional, Krishna, Lord, Prasadam, Puja, Temple-Latest News - T Telugu Arjuna, Devotional, Krishna, Lord, Prasadam, Puja, Temple-Latest News - T](https://telugustop.com/wp-content/uploads/2023/08/temple-lord-Krishna-Arjuna-Panchamrutha-prasadam-nutrients-devotional.jpg)
జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదురుకోవడానికి అవసరమైన మనో బలాన్ని పొందుతారు.దేవతలు కూడా కష్ట సమయాల్లో మీతో కలిసి ఉంటారు.ఇంకా చెప్పాలంటే భగవద్గీత ప్రకారం భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత ఇతరులకు దానం చేయడం ద్వారా మనకు స్వర్గంలో నివాసం లభిస్తుంది.అలాగే దేవతల నివాసానికి వెళ్లి వారికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ప్రసాదం తిని ఇంటికి చేరుకున్న వారికి పునర్జన్మ ఉండదని కృష్ణుడు అర్జునుడికి( Lord krishna ) చెప్పాడు.
DEVOTIONAL