ముఖ్యంగా చెప్పాలంటే సిద్దిపేటలోని బూరుగుపల్లి, వాయుపురి వేదికగా నెలకొల్పిన ఈ ఐకానిక్ టెంపుల్ సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో అప్సుజా ఇన్ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరి కృష్ణ జీడిపల్లి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వసీం చౌదరి పాల్గొన్నారు.
చాలా నెలల తరబడి కష్టపడి అంకితభావంతో రూపొందించిన ఈ దేవాలయం సాంప్రదాయ, అత్యాధునిక సాంకేతికతతో ఈ నిర్మాణం జరిగిందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.ఈ నిర్మాణం అద్భుతం అని 35.5 అడుగుల పొడవు మరియు నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉందని చెబుతున్నారు.
ఇది మానవ చాతుర్యం,భక్తికి విస్మయపరిచే నిదర్శనంగా నిలుస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆలయం ప్రతిష్టాపన పూర్తి అయిన తర్వాత నవంబర్ 24వ తేదీ నుంచి ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంటుంది.ఈ సందర్భంగా అప్సుజా ఇన్ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి మాట్లాడుతూ నవీనత సంప్రదాయాల సమన్వయంతో దైవ దర్శనానికి జీవం పోస్తూ సిద్దిపేటలోని చర్విత చర్విత మెడోస్లో త్రీడీలో నిర్మించిన హిందూ దేవాలయం( Hindu temple ) ఆలయం మన అంకితభావానికి నిదర్శనం అని చెప్పారు.
అలాగే సాంకేతికతను ఆధ్యాత్మికతతో విలీనం చేయడం కాలాన్ని మించిన పవిత్రమైన స్థలాన్ని ఏర్పరచడం కోసం ఎంతో కృషి చేశామని తెలిపారు.
అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే మాట్లాడుతూ ఇది మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొట్ట మొదటి త్రిడి దేవాలయం( Tridi Temple ) అని చెప్పారు.ఈ నిర్మాణ అవసరాలు దేవాలయ రూపకల్పన సూత్రాలు, త్రిడి పెయింటింగ్ అవసరాలు ఇన్-సైట్ నిర్మాణంలో సవాళ్లతో కూడుకున్నది.కాన్సెప్ట్ యొక్క సరిహద్దులు ఎత్తైన ప్రాంతాలు డెజర్ట్లు,మంచుతో నిండిన ప్రాంతాలు వంటి అగమ్య ప్రాంతాలలో సింప్లిఫోర దృఢమైన సిస్టమ్ల భవిష్యత్తు అప్లికేషన్లకు వేదికగా నిలుస్తుందన్నారు.
DEVOTIONAL