ప్రతీ ఏటా నాగుల పంచమి రోజున తన శరీరంలోకి గేదె ఆత్మ ప్రవేశిస్తుందని చెప్పుకుంటూ ఓ వక్తి.అచ్చం గేదెలాగే దాణా, మేత తింటూ చుట్టుపక్కల వారిని ఆకర్షిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ లో జిరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.మహారాజాగంజ్ లోని రుద్రపూర్ శివనాథ్ గ్రామానికి చెందిన బుధిరామ్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా నాగ పంచమి రోజున తనలో బైంసాసుర ఆత్మ ప్రవేశిస్తుందని విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు.
రోడ్ వేస్ లో ఉద్యోగిగా పపదవీ విరమణ చేసిన బుధిరామ్ చేసే ఈ విన్యాసాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు భారీగా తరలి వస్తున్నారు.ఈ ఏడాది కూడా ఆయన గేదె ఆత్మ తనలో ప్రవేశించిందని విన్యాసాలు చేశారు.
గ్రామంలోని మాత ఆలయంలో ప్రతిష్టించిన బైంసాసురుని విగ్రహం ముందు కూర్చొని గడ్డి, పశుగ్రాసం వంటి వాటిని ఆ శబ్దంతోనే తింటున్న వీడియో వైరల్ అవుతోంది.స్థానికులు మాత్రం నాగ పంచమి రోజున బుధిరామ్ జంతువుగా మారిపోతారని చెబుతున్నారు.
ఆయనను దైవాంశగా భావించి పూలతో స్వాగతం పలుకుతారు.బుద్దిరామ్ ఈ ప్రత్యేకమైన విశ్వాసాన్ని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.గతం 40 నుంచి 45 ఏళ్లుగా బైంసాసురుడి ఆత్మ తనలోకి వస్తుందని స్వయంగా బుద్ధిరామ్ చెప్పడం గమనార్హం.మిగిలిన రోజుల్లో సాధారణ జీవితం గడిపే ఆయన నాగ పంచమి రోజు మాత్రం గడ్డి, అరటి పండ్లు వంటివి మాత్రమే తింటుటాడు.
అచ్చం అలాగే శబ్దం కూడా చేస్తుంటారు.