విజయసాయిరెడ్డికి విశాఖ కార్మిక సంఘాల ఎఫెక్ట్..!!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవటానికి నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తాజాగా చేపట్టారు.

ఈ క్రమంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన వైసిపి పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయి రెడ్డి కి అక్కడే ఉన్న కార్మిక సంఘాల సెగ తగిలింది.

నిరసన కార్యక్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో సిపిఎం కార్యకర్తలు మరియు అనుబంధ సంస్థ కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.విశాఖ ప్లాంట్ కొనసాగించే ప్రయత్నం చేద్దామని, మరియు కొన్నిసార్లు లక్ష్యం నెరవేరుతుంది అని, కొన్నిసార్లు నెరవేర రాకపోవచ్చని విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లకు సభా ప్రాంగణంలో ఉన్న కార్మిక సంఘాలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో నినాదాలు చేస్తున్న గాని విజయసాయిరెడ్డి మాత్రం ఎక్కడ తన ప్రసంగం ఆపకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని మన డిమాండ్లు పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దామని అక్కడ ఉన్న కార్మికులకు విజయసాయిరెడ్డి సర్ది చెప్పారు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు