కొత్త ఆఫీస్ కు లేదా కొత్త ప్రదేశానికి వెళ్లిన కొద్ది రోజులలోనే మూడ్ లో చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది.ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది.
లేక ఇంటిలోని ఏ సభ్యుడికైనా కోపం పెరుగుతుందని అనిపిస్తూ ఉంటుంది.ఇలా జరగడానికి వాస్తు లోపం కూడా కారణం కావచ్చు.
కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.శ్రీకృష్ణుడు తన శ్లోకంలో చెప్పినట్లుగా మనిషి పతనానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.
అవి కామం, క్రోధం, దురాశ ఈ దుర్గుణాలు మనిషిని వినాశనం వైపు నడిపిస్తాయి.జీవితంలో సంతోషంగా లేని వ్యక్తి ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు.
ఆ వ్యక్తి జీవితం దానిలోనే మునిగిపోతూ ఉంటుంది.కాబట్టి ఏ కారణం చేతనైనా కోపం తెచ్చుకోవడం అస్సలు మంచిది కాదు.అయితే కోపం అనే ఫీలింగ్ రోజురోజుకు పెరిగిపోతూ అదుపులో పెట్టుకో లేకపోతే దానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చు.వాతావరణం, దిశా, నివాస గృహం, కార్యాలయం, పర్యావరణ ప్రబావాల కారణంగా కూడా కోపం పెరిగే అవకాశం ఉంది.
ఆగ్నేయ దిశకు తలపెట్టి నిద్రపోకూడదు.ఆగ్నేయ దిశను అగ్ని మూల అని కూడా అంటారు.
ఈ దిశలో తలపెట్టి నిద్రపోవడం ఏ కారణం చేతనైనా అసలు మంచిది కాదు.నిద్రించే దిశ తూర్పు దక్షిణంగా( East direction ) ఉండాలి.
ఆగ్నేయం వైపు తలపెట్టి నిద్రపోవడం వల్ల కోపం పెరుగుతుంది.కోపం అగ్ని లాగా మండుతుంది.
ఈ దిశలో ఎక్కువసేపు కూర్చోవడం కూడా అసలు మంచిది కాదు.
ఇంట్లో ఎవరికైనా కోపం ఎక్కువగా ఉంటే సైంధవ లవణాన్ని ఇంట్లో పడక గదిలో ఎక్కడైనా ఉంచవచ్చు.కోపం వచ్చినప్పుడు గురువు మంత్రాన్ని జపించాలి.ఇంట్లో మీకు కోపం తెప్పించే వ్యక్తులు ఉంటే ఎరుపు రంగును అసలు ఉపయోగించకూడదు.
అంతేకాకుండా కోపం వచ్చినవారు సోమవారం ఉపవాసం( Fasting ) ఉండాలి.ఆహారం ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.
రాత్రి చంద్రునికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించాలి.ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే భూమాతకు ఐదుసార్లు నమస్కరించాలి.
అలాగే కోపాన్ని అదుపు చేసేందుకు భూమాత దగ్గర ప్రార్థించాలి.
DEVOTIONAL