రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో గ్రూప్ 4 అభ్యర్థులు శనివారం రోజు పేపర్ రాయడానికి హాజరు కాగా భారీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.మండలంలో ఐదు సెంటర్లను కేటాయించగా వివిధ మండలాల నుండి గ్రామాల నుండి వచ్చిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ల ద్వారా సెంటర్లను చెక్ చేసుకుని పరీక్ష రాయడం జరిగింది.
సంబంధిత అధికారులు, పోలీసులు గ్రూప్ 4 అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతఅనుమతించడం జరిగింది.ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, ఎల్లారెడ్డిపేట సిఐ మొగిలి, ఎల్లారెడ్డిపేట ఎస్సై ప్రేమ్ దీప్, వీర్నపల్లి ఎస్సై నవత, పోలీస్ సిబ్బందితదితరులు పాల్గొన్నారు.