ముఖ్యంగా చెప్పాలంటే శ్రీశైల పుణ్య క్షేత్రాన్ని( Srisailam ) దర్శించుకోవడానికి మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు.ఈ పుణ్య క్షేత్రాన్ని ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.
అలాగే కొంత మంది భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.అలాగే మరి కొంత మంది భక్తులు స్వామి వారికి తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల దేవాలయం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.ఆ శుభవార్త ఏమిటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని దేవాలయ అధికారులు వెల్లడించారు.

అలాగే శ్రీశైలం దేవస్థానం తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులకు నెలలో ఒక రోజు ఉచిత సామూహిక సేవలు ప్రవేశపెట్టింది.ఇంకా చెప్పాలంటే అరుద్రోత్సవం( Arudrotsavam ) సందర్భంగా తెల్ల రేషన్ కార్డు భక్తులకు ఉచిత సామూహిక సేవగా శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణం నిర్వహించారు.అలాగే మండపంలో శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణానికి 250 మంది తెల్ల రేషన్ కార్డు భక్తులు పాల్గొన్నారు.కళ్యాణం తర్వాత ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

ఇంకా చెప్పాలంటే శ్రీశైలం క్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది.అలాగే కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో మల్లన్న దర్శనానికి భక్తులు తరలివస్తు ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఉగాది బ్రహ్మోత్సవాలు, శివరాత్రి( Maha Shivratri ) బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.మొత్తంగా ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులకు శ్రీశైలం మల్లన్న దేవాలయ అధికారులు శుభవార్త చెప్పారని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ అవకాశాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని దేవాలయ అధికారులు చెబుతున్నారు.