శ్రీ సింహ కోడూరి, 'దొంగలున్నారు జాగ్రత్త' షూటింగ్ పూర్తి- త్వరలో థియేటర్లలో విడుదల

డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’.యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు.

 Shree Sinha Koduri, Satish Tripura, Suresh Productions, Guru Films 'dongalunnaru-TeluguStop.com

డిఫరెంట్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.‘దొంగలున్నారు జాగ్రత్త’ తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం కావడం విశేషం.

ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్సెలో ప్రీ-ప్రొడక్షన్ పనులను చూపించారు.సెట్‌ను సిద్ధం చేయడంతో పాటు, కస్టమ్-మేడ్ కారును కూడా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియో చివర్లో శ్రీ సింహ కోడూరి ఎంట్రీ ఇచ్చారు.72 మంది టీంతో 342 గంటల్లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారని మేకర్స్ వెల్లడించారు.అలాగే సింగల్ లొకేషన్ లో షూట్ చేశారు.సినిమా కథాంశానికి వస్తే.ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించిన మలుపులు తీరుగుతుంది.తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

ఈ చిత్రంలో ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.ఇందులో అత్యున్నత సాంకేతిక బృందం పని చేస్తుంది.

ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా, యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: శ్రీ సింహ కోడూరి, ప్రీతి అస్రాణి, సముద్రఖని

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube