బాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న మరొక పెద్ద సినిమా బ్రహ్మాస్త్రటీమ్ అంతా బాలీవుడ్ మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.ప్రెజెంట్ టీమ్ అంతా ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఈ ప్రొమోషన్స్ తెలుగులో పీక్స్ కు చేరుకున్నాయి.మన తెలుగు బుల్లితెరపై కూడా వరుస ప్రొమోషన్స్ చేస్తూ సందడి సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా అలియా, రణబీర్ జంట బిగ్ బాస్ తెలుగు లో కూడా సందడి చేసారు.నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో నిన్న గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.
ఈ షోలో వీరు తెలుగు వర్షన్ లో కేసరియా పాట పాడి అలరించడమే కాకుండా కొన్ని ఆసక్తికర విషయాలను సైతం పంచుకున్నారు.అలాగే నాగార్జున-అమల జంటను ఈ వేదికపై ప్రశంసించారు.
వారు ఎక్కువుగా ఇష్టపడే జంటల్లో నాగార్జున-అమల మేమ్ జోడీనే అంటూ చెప్పి తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కున్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారి తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటిస్తుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు నాగ్ కూడా కీలక పాత్రలో నటించాడు.అలాగే టాలీవుడ్ అగ్ర డైరెక్టర్ రాజమౌళి సైతం ఈ సినిమాలో భాగం అయ్యారు.
సౌత్ లోని నాలుగు భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడంతో ఈ సినిమాపై ఇక్కడ కూడా అంచనాలు పెరిగాయి.