గంభీరావుపేటలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) గంభీరావుపేట మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ముదిరాజ్ జర్నలిస్టుపై పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy ) చేసిన అనుచిత వ్యాఖ్యలపై గాంధీ చౌరస్తా వద్ద శివయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పౌడి కౌశిక్ రెడ్డి తన మార్కు పాలిటిక్స్ తో ఎప్పుడు ఏదో వివాదంతో వార్తలను నిలుస్తుంటారు .

హుజురాబాద్ నియోజకవర్గం( Huzurabad Assembly constituency ) లోని కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా కౌశిక్ రెడ్డి వ్యవహారం వివాదంగా మారిన ఘటనలు ఉన్నాయి.ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్పుగా పదవిలో ఉన్న పౌడి కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోలేదన్నారు.

ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News