ఒరిగిన విద్యుత్ స్తంభంపై అధికారుల సిరియస్...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నరసయ్యగూడెం కాలనీలో పంట పొలాలలో 11కేవి విద్యుత్ స్తంభం పూర్తిగా ఒరిగిపోయి,ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సోమవారం వివిధ దినపత్రికల్లో ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు వెంటనే స్పందించారు.

హుటాహుటిన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టి,విద్యుత్ తీగలు సరి చేయించారు.

Latest Suryapet News